ఆగస్ట్ 26 తిరుపతిలో మన అన్న చిరంజీవి గారి రాజకీయ రంగ ప్రవేశంసందర్భంగా మెగా షో (అనగా భారీ సభ )నిర్వహించారు. అది అందరకి తెలిసిన విషయమే…! సభలో చిరు లెక్కలేనన్ని వరాలు కురిపించారు. ఆయన పార్టీ పేరు ప్రజా భోజ్యం… సారీ ప్రజారాజ్యం. ఆ… ఏదయినా ఒకటే ఎవరైనా ఒకటే మనకి వచ్చిచచ్చేదేమిలేదు. మన చిరుకి ఆ జనాన్ని చూసేసరికి కాళ్ళల్లో వణుకు ప్రారంభమైంది. ఎలాగో ధైర్యం కూడగట్టుకుని ఆ ఏడుకొండలవాడిని మనసులో తలుచుకొని , మన పరుచూరి బ్రదర్స్ రాసిచ్చిన స్క్ర్రిప్ట్ చదవటం మొదలు పెట్టారు. అటు ఏడుకొండలవాడి కొండ ఇటు మీఅండ నాకు నిండుగా వుంటే నేనేదయినా సాధించగలను అంటూ ఒక గంట సేపు తన జీవితం గురించి ఆతరువాత రాజకీయాల గురించి చెప్పే ఒక్కొక్క డైలాగుకి మన గొర్రెలమంద అదేమన జనాలు చప్పట్లు కొడుతు తమ ఆనందం వెలిబుచ్చారు.
ఇహ వరాల మూట విప్పుదాం. మద్యపాన నిషేధం, గిరిజనుల అభివృద్ది , పల్లెల్లొ అన్నిసదుపాయాలతో ప్రభుత్వ హాస్పటల్స్ , ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ! ఆతరువాత జండావిష్కరణ. ఎలాగో అయిందనిపించి మూడు తోపులాటలు, ఆరు దెబ్బలతో బయట పడ్డారు. అక్కడే వున్న అల్లుఅరవింద్ ని ,నాగబాబుని ,పవన్ కల్యాణ్ ని, ఇంకా ఇతరులనిచూసి ఓరినాయినోయి ఇదేం సభ ఇదేంగోల తొక్కి చంపేస్తారేమో అని భయమేసింది. నావల్ల కాదు బాబోయి ఈ రాజకీయాలు వద్దు నాబొంద వద్దు నాదారిన నేను నాసినిమాలు వేసుకొంటూ హ్యాపీగా గడిపేస్తాను. అనుకొంటూ ఆరాత్రికి ఏడుకొండలవాడిని దర్సించుకోవటానికి కుటుంబంతో ఆలయానికి వెళ్ళారు. ఇక్కడ ఇలా వుండగా అక్కడ గుళ్ళో పరిస్తితి ఎలా వుందంటే స్వామివారి పరిస్తితి కడుదయనీయంగా వున్నది. ఒకపక్కన రాజుగారు భ్రష్టు పట్టించిన ఏడుకొండల్ని తలుచుకొంటూ ఒకప్పటి తన పరిస్తితి తన వైభోగం ఇప్పటి తన చాతకాని తనం దేవుడి పాలనలో తనని అధః పాతాళానికి తొక్కెయ్యాలన్న రాజావారి సంకల్పం, పది ఘడియలైనా దేవేరితో దొరకని ఏకాంతం. ఇంతకీ అష్ట దిక్పాలకులైనా తనవైపు ఉన్నారో లేరో అన్న అనుమానం, ఎటు తిరిగి నేను రాయినని అందరు దేవుడి పాలనలో చేరి పోయారా…? అన్న సందేహం, అసలు ఇప్పుడు నేనేంటీ..? నాఉనికేంటి..? అంటూ ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు. ఒక పక్కనించి ఎడ తెరిపి లేని జనం, పూట కొక రాక్షకీయ నాయకుడు వచ్చి నన్నే సింహాసనం ఎక్కించమంటాడు. పిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్లు నాకు ఏదోక ఎర వేస్తారు. ఏడుకొండలవాడా… వెకటరమణా… గొవిందా గోవిందా… అని ఒకపక్క, ఆపదమొక్కులవాడా అనాధ రక్షకా గొవిందా గోవిందా… అని, ఇంకోపక్కన వడ్డి కాసులవాడా గొవిందా గోవిందా… అని ఆలయం హోరెత్తిపోతోంది . ఇటు చిరుసభకి వచ్చినవాళ్ళందరూ ఆఏడుకొండలవాడిని దర్సించుకోవటానికి రావటంతో గుడి కిటకిట లాడిపోతోంది అసలే వేలసంవత్సరాలనించి నిలబడి నిలబడి స్వామివారికి చిరాకు ,అలసట, కాళ్ళు పీకుట ,కిరీటం మోసి మోసి శిరోవేదన, జనాల గోడు విని విని చెవులు దిబ్బెళ్ళెక్కి తిక్క తిక్కగావుంది. ఛీఛీ వెధవ గోల నేను ఎందుకు ఈఅవతారమెత్తానో ఏమిటో దేవేరులిద్దరికి బేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వూరుకున్నంత వుత్తమంలేదు బోడిగుండంత సుఖం లేదని నాపాటికి నేను వూరుకోక శిలగా మారితే ఏబాధా వుండదనుకొన్నాను ఇంతమంది గోల భరించే కన్నా ఆఇద్దరి గోల భరిస్తే పోయోది. శిలగామారి నెత్తికి తెచ్చుకున్నాను ఇప్పుడు ఇక్కడనించి కదలలేను అవతలకి వెళ్ళలేను ఈబాధ భరించలేను అనుకుంటూ వున్నారు స్వామివారు. ఇంతలో మన చిరు గారు ఆలయం లోకి ప్రవేశించారు. స్వామిని కనులారా చూస్తూ స్వామి నీకేం హాయిగా వున్నావు నాగతిచూడు తండ్రీ అందరు కలిసి రాజకీయాలు అని ముందుకుతోసారు. అక్కడ జనాలు తిక్కప్రశ్నలతో చంపెస్తున్నారు నీకేంపట్టనట్టు హాయిగా చిద్విలాసంగా నవ్వుతున్నావు కొన్నాళ్ళు నన్నుకూడ నీలాగ రాయిగా చెయ్యి స్వామి వీళ్ళబారి నుంచి నన్నుకాపాడు తండ్రీ అని కళ్ళుమూసుకొని భక్తితో ప్రార్దించాడు. వెంకన్నబాబుకి ఇంత గోలలో మన హీరో గారి ఆవేదన చెవులకి సోకింది. నాయనా… రోలువెళ్ళి మద్దెలతోమొరపెట్టుకున్నట్టు నువ్వొచ్చి నాతో…… అనీ అనగానే ఇంతలో ఆయనకి ఏదోఆలోచన వచ్చింది. మనిద్దరం అటుదిటు అవుదామా…? భక్తా అని అన్నారు. మనచిరంజీవికి అదిలీలగా వినపడింది. ఏమన్నావు స్వామీ అయినా నువ్వు ఏమంటావు నాపిచ్చికాని అనుకొన్నాడు మనసులో. కుమారా నువ్వు విన్నది నిజమే నాయనా కొన్నాళ్ళు నువ్వు వెంకన్నగా నేను చిరంజీవిగా మారదాం అనిమళ్ళీ వినిపించింది. ఇహ మనహీరోగారికి అంతా అయోమయంగా వుంది తనేమిటి వెంకన్నగా మారటం ఏమిటీ అలోచిస్తూండగానే ఇద్దరి రూపాలు మారిపోయాయి. అటు మన చిరంజీవి వెంకన్నకి ఇటు వెంకన్నచిరంజీవికి వుత్సాహం వురకలేసింది అహా నేనిప్పుడు రాయినైపోయా ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఏప్రశ్నలూ అడగరు అని చిరంజీవి ఓహో నేనిప్పుడు స్వేచ్చాజీవిని ఏభక్తులూ వరాలు అడగరు అని వెంకన్న ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు. కాని ఇక్కడే అసలు కధ ప్రారంభమైంది ఇంతలో ఒకభక్తుడు స్వామివారినిచూస్తూ తండ్రీ తెల్లవారేసరికి నేను గొప్ప ధనవంతుడ్ని అయిపోవాలి అనిదణ్ణం పెట్టుకున్నాడు. కొత్తగా వచ్చిన ఫోస్ట్ కదా అందుకని తధాస్తు అని దీవించాడు. ఇంకొక భక్తుడు స్వామీ నాకు మంచి వుద్యోగం కావాలని కోరుకున్నాడు, ఒక భక్తురాలు పిల్లలు కావాలని, ఒక స్టూడెంట్ ఎమ్ సెట్ లో ర్యాంక్ రావాలని, కొత్తగాపెళ్ళైన జంట తమకాపురం సజావుగా సాగాలని, ఒకరాజకీయ నాయకుడు తాను అయితే పీయమ్ లేకపోతే కనీసం సీయమ్ కావాలని, ఇలా అందరు తమ కోరికలు విన్నవించుకుంటూ ఏదో ఉడతాభక్తిగా తమకు తోచిన కానుకలు హుండీలో వేస్తున్నారు అప్పుడు తెలిసింది మనచిరంజీవి వెంకన్నకి రాళ్ళకి కూడాబాధలు వుంటాయని (అంటే వెంకటేశ్వర స్వామికి అన్నమాట ). మెల్లిగామొదలైంది అయ్యగారికి అదిరిపోయే తలనెప్పి. ఇక్కడ ఇలా వుంటే అక్కడ వెంకన్న చిరంజీకి రాజకీయ కష్టాలుమొదలైయ్యాయి పక్కనవున్నభజనపరులు ప్రెస్ మీట్ పెట్టారు అందులో ఒక్కొక్కడూ ఒక్కోప్రశ్నా అడుగుతుంటే తల తిరిగి పోయింది. అనుకొన్నది ఒకటి అయినది ఒకటి యుగాల నించి నిలబడి నిలబడి కాళ్ళు స్వాధీనంలో లేవని కొంత కాలం పాటు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని ఆశపడి అవతారం మార్చుకుంటే ఈగోలేంటి అనుకొని వెంటనే చిరంజీవివెంకన్నతో నాయనా నాఅవతారం నాకిచ్చేయ్యిబాబు ఈతిప్పలు నేనుపడలేను అని అడిగాడు. అప్పడే భక్తుల తాకిడి తగ్గి పవళింపు సేవతో పవళించిన మన వెంకన్నకి ఈమాటలేవి వినిపించలేదు. దిగ్గున నిద్ర నించిలేచారు రాజావారు ఏం కల చీచీ పాడు కల ఇంత కష్టపడి ఉపయోగం ఏముంది ఆ అవతారం మార్పేదో నాకు రావచ్చు కదా అంటూ నిట్టూర్చారు అయ్యవారు (వైఎస్ గారు).
ఏప్రియల్ 20, 2009
వై..రాజ్యం మార్పు
1 వ్యాఖ్య »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
Excellent writeup. Samuel Reddy is the most dangerous person facing by India and Hindus.
And his supporters among Hindu castes such as Reddy and Brahmin are more dangerous for not knowing about Samuels true colors and for supporting him.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా prasad — ఏప్రియల్ 20, 2009 @ 6:09 అపరాహ్నం